Akshaykumar : అక్షయ్‌ కుమార్‌ హీరోగా అహ్మద్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న “వెల్‌కమ్ టు ది జంగిల్” సినిమా విడుదల వాయిదా పడింది. “వెల్‌కమ్” ఫ్రాంచైజీలో మూడో భాగమైన ఈ చిత్రం ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుదల కావాల్సి ఉండగా, నిర్మాణ, షూటింగ్‌లో జాప్యం కారణంగా వచ్చే ఏడాది వాయిదా పడింది.

“భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు కూడా జాప్యం కావడంతో క్రిస్మస్‌కు సినిమాను సిద్ధం చేయడం అసాధ్యమని చిత్రబృందం భావించింది. అందువల్ల 2025లో సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు” అని చిత్రబృందానికి సన్నిహిత వర్గాలు తెలిపాయి. దిశా పటానీ, సంజయ్‌ దత్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, రవీనా టాండన్‌ లాంటి నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌వాలా, జ్యోతి దేశ్‌పాండే నిర్మాతలు.

Leave a comment

error: Content is protected !!