Akkineni Nagachaitanya : నవయువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా, కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. “విరూపాక్ష” సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న కార్తీక్ దండు ఈ సినిమాని తనదైన స్టైల్లో తెరకెక్కిస్తుండడంతో.. దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో నాగ చైతన్య డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడు. రెండు పాత్రల్లో ఒకటి చాలా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఈ పాత్ర కోసం చైతన్య న్యూ లుక్ లో కనిపించబోతున్నారని టాక్.

ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది . వీరిద్దరి మధ్య సాగే లవ్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఊహా గానాలు ఉన్నాయి. కాగా, ప్రస్తుతం నాగ చైతన్య “తండేల్” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. మరి అక్కినేని నాగ చైతన్య న్యూ లుక్ ఎలా ఉంటుందో, ఆయన డ్యూయెల్ రోల్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!