కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. అందుకే లాక్ డౌన్ ను ఈ నెలాఖరు వరకూ పొడిగించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.  ఈ నేప‌థ్యంలో అంతా ఇంటికే ప‌రిమితం కావాల‌ని, ఇళ్లే శ్రేయ‌స్క‌ర‌మ‌ని దేశ ప్ర‌ధానితో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం, సెల‌బ్రిటీలు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అఖిల్ పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. త‌ల్ల‌దండ్రులు అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌తో క‌లిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసిన అఖిల్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేశారు. ఈ ఇద్ద‌రి గురించి వ‌ర్ణించ‌డానికి నా ద‌గ్గ‌ర ప‌దాలు లేవు. ఈ విష‌యంలో నేను చాలా అదృష్ట‌వంతుడిని. ఎవ‌రికైనా ఫ్యామిలీనే ఫ‌స్ట్ ఆ త‌రువాతే ఎవ‌రైనా. ఈ విష‌యాన్ని అర్థం చేసుకుని ఇంట్లోనే వుండండి.. సేఫ్‌గా వుండండి. పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. అని పేర్కోన్నారు.

Leave a comment

error: Content is protected !!