Vidamuyarchi : తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే “గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ” చిత్రం యొక్క మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసిన ఆయన ఇప్పుడు “విడాముయర్చి” చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఈ నెల 24 నుంచి అజర్‌బైజాన్ రాజధాని బాకులో ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్‌లో భాగంగా అజిత్‌పై భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో త్రిష కథానాయికగా నటిస్తుండగా, అర్జున్, రెజీనా, సంజయ్‌ దత్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నీరవ్‌ షా, ఓం ప్రకాశ్‌ ఛాయాగ్రహణం వహిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!