Kollywood : బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ దక్షిణాది ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమిర్, మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ . తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఆమిర్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటపడింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ చిత్రంలో ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయంపై చిత్ర బృందం ఆమిర్‌తో చర్చలు జరుపుతోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. రజనీకాంత్ , ఆమిర్ ఖాన్ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చిత్రంలో కలిసి నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!