SS Rajamouli : ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో భారతీయ సినిమాకి ఆస్కార్‌ అవార్డు తో గౌరవం తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి. అలాంటి ఆయనకు, ఆయన సతీమణి రమా రాజమౌళికి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఈ దంపతులకు ఆస్కార్‌ అకాడమీ ఆహ్వానం పలికింది. ఈ ఘనత సాధించిన వారిలో ఇటీవలే చలనచిత్ర పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ నటి షబానా అజ్మీ కూడా ఉన్నారు.

ఈ సంవత్సరం 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ తాజాగా ఆహ్వానం పంపింది. అందులో రాజమౌళి దంపతులు, షబానాతో పాటు నిర్మాత రితేష్‌ సిధ్వానీ, ఛాయాగ్రాహకుడు రవి వర్మన్‌ కూడా ఉన్నారు. “ఈ ఏడాది కొత్త సభ్యులను స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన కళాకారులు, నిపుణులు చిత్రరంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపించారు” అంటూ అకాడమీ ప్రముఖులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

Leave a comment

error: Content is protected !!