Shopping Cart 0 items - $0.00 0

శోభన్ బాబు ‘ముగ్గురు మిత్రులు’ చిత్రానికి 35 ఏళ్ళు

నటభూషణ్ శోభన్ బాబు నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ముగ్గురు మిత్రులు’. జయభేరి ఆర్ట్స్ పతాకంపై మురళీ మోహన్ నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడు రాజాచంద్ర. 1985 లో విడుదలైన ఈ సినిమా 35 ఏళ్ళు పూర్తి చేసుకుంది. శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్ ముగ్గురు మిత్రులుగా నటించిన ఈ సినిమాలో సుహాసిని, సుమలత, తులసి కథానాయికలు గా నటించారు. ఇంకా కైకాల సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, అనిత, అన్నపూర్ణ, ప్రసాద్ బాబు, పి.జె.శర్మ, ఈశ్వరరావు, చలపతిరావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఇక  డాక్టర్ గా శోభన్, పోలీసాఫీసర్ గా మురళీ మోహన్ , లాయర్ గా చంద్రమోహన్ నటించి మెప్పించారు.

చట్టాన్ని రక్షించే  నిజాయితీ పరుడైన పోలీసాఫీసర్ రంజిత్ కు ఒక ధర్మ సంకటం ఎదురవుతుంది. అయితే అతడ్ని ఆరో ప్రాణంగా భావించే అతడి మిత్రుడు చక్రవర్తి .. మరో మిత్రుడైన లాయర్ తో కలిసి ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాడన్నది మిగతా కథ. నూతన్ ప్రసాద్ విలన్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్టైంది. చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.

 

 

 

Leave a comment

error: Content is protected !!