అక్కినేని నాగేశ్వరరావు నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ డ్రామా దాంపత్యం. సుహాసిని, జయసుధ జంటగా నటించిన ఈ సినిమాకి దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. అనురాధా ఆర్ట్స్ కంబైన్స్ బ్యానర్ పై ఆర్.వి. కృష్ణారావు నిర్మించిన ఈ సినిమా 1985 లో విడుదలై.. 35 ఏళ్ళు పూర్తి చేసుకుంది. మురళీ మోహన్ , గుమ్మడి, రాళ్ళపల్లి , ఈశ్వరరావు, రాజ్ వర్మ, నళినీ కాంత్, తులసి, రాజ్యలక్ష్మి, కల్పానారాయ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అక్కినేని నటించిన చాలా సినిమాల్లో మాదిరిగానే… డాక్టర్ సత్యమూర్తి..  లలిత అనే మరో డాక్టర్ ను ప్రేమించి… అనివార్య కారణాల వల్ల జానకి అనే అమ్మాయిని పెళ్ళిచేసుకోవాల్సి వస్తుంది. చాలా కాలానికి మళ్ళీ సత్యమూర్తికి లలిత జ్నాపకాలు వెంటాడతాయి. అప్పుడు సాగే అద్భుతమైన డ్రామా ఈ సినిమాకి హైలైట్. చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా కోయిల కోయిల పాడమ్మా పాట సినిమాకే హైలైట్ . ఆ తర్వాత ఇధే సినిమాను తమిళంలో శివాజీగణేశన్ తో  అదే పేరుతో రీమేక్ చేయడం విశేషం.

Leave a comment

error: Content is protected !!