‘గూఢచారి’ సూపర్ హిట్టవ్వడంతో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు తమ జీయంబీ  ప్రొడక్షన్స్ సంస్థలో టాలీవుడ్ యంగ్ చాప్ అడివి శేష్ కు ‘మేజర్’ చిత్రంలో పిలిచిమరీ హీరో ఛాన్సిచ్చాడు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో .. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.  మరో టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ తో కూడా ఒక సినిమా నిర్మించబోతున్నట్టు  సమాచారం.

మరో రెండు మూడు వారాల వ్యవధిలో  మహేశ్ బాబు నిర్మాణ సారధ్యంలో సినిమాకి సంబంధించిన  అధికారిక ప్రకటన వెలువడే ఛాన్సుందట. ప్రస్తుతం శర్వానంద్ కోసం జీఎంబీ బృందం స్క్రిప్టును ఫైనల్ చేసే పనిలో ఉందట. అయితే కథాంశం ఎలాంటిది? అన్నది మాత్రం రివీల్ కాలేదు. హ్యాట్రిక్ ఫ్లాపులతో రేసులో వెనకబడినా శర్వాకి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. శ్రీకారం  మూవీ సహా ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు మహేష్ బ్యానర్ లో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి జీయంబీ సంస్థకు శర్వానంద్ ఏ రేంజ్ హిట్టిస్తాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!