‘క్షణం, జ్యోతిలక్ష్మి, బ్లఫ్ మాస్టర్, ఇస్మార్ట్ శంకర్’  లాంటి చిత్రాలతో టాలీవుడ్లో టాలెంటెడ్  హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సత్యదేవ్. ఎలాంటి పాత్రనయినా అలలీలగా రక్తి కట్టించగలడనే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో ‘47 డేస్ , ఉమా మహేశ్వరా ఉగ్రరూపశ్య’ అనే రెండు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ విడుదలకు రెడీ అవుతున్నాయి. అయితే అవి థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల కానున్నాయని మేకర్స్ చెబుతున్నారు.

‘మహేషిండే ప్రతీకారం’ మలయాళ చిత్రానికి రీమేక్ వెర్షన్  అయిన ‘ఉమామహేశ్వరా ఉగ్రరూపస్య’ చిత్రంను నెట్ ప్లిక్స్ లో విడుదల చేయనుండగా ‘47 డేస్ ’ సినిమాను జీ5 యాప్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈనెల 30వ తారీకున 47 డేస్  చిత్రాన్ని  జీ 5 లో విడుదల చేయబోతున్నట్లుగా పేర్కొన్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. విభిన్నమైన సినిమాలు చేస్తూ నటుడిగా మంచి పేరు దక్కించుకుంటున్న సత్యదేవ్ ఈ రెండు సినిమాలతో ఓటీటీ ప్రేక్షకులను  ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!