స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ఈ ఏడాది ప్రారంభంలోనే ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆ విజయోత్సాహంతోనే  సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రం కోసం పాన్ ఇండియా హీరోగా మారేందుకు రెడీ అయ్యాడు. ఎర్రచందనం స్మిగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో .. లారీ డ్రైవర్ గా రఫ్ అండ్ టఫ్ మేకోవర్ తో ఆ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించాడు. నిజానికి  తొలి షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మార్చ్ లోనే తదుపరి  షెడ్యూల్ షూటింగ్ కు వెళ్ళాల్సింది. అయితే లాక్ డౌన్ కారణంగా .. ఈ సినిమా చిత్రీకరణకు అంతరాయం కలిగింది.

మారేడుమిల్లి లో కీలక షెడ్యూల్ జరపాలని ప్లాన్ చేశారు. తాజా పరిస్థుతుల నేపథ్యంలో అక్కడ షూటింగ్ కి హీరో ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపించకపోవడంతో ఫారెస్ట్ సెట్ ని అన్న పూర్ణ సెవెన్ ఎకర్స్ లో రీ క్రియేట్  చేస్తున్నారట. ఇప్పటికే సెట్  వర్క్ ని మొదలు పెట్టారట. వన్స్ వర్క్ కంప్లీట్ అయితే హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక షూటింగ్ కి రానున్నారట. మరి ఈ సినిమా బన్నీ, సుక్కులకు ఏ రేంజ్ లో ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!