Shopping Cart 0 items - $0.00 0

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పూర్తి చేసిన ప్రభాస్

 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెమెరా కంటికి చిక్కి చాలా రోజులైపోయింది. ప్రస్తుతం మనోడు జిల్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగింది. లాక్ డౌన్ కు ముందే ఈ సినిమాలోని చాలా భాగం చిత్రీకరణ పూర్తి అయింది. త్వరలోనే ఈ సినిమా తరువాయి భాగం  షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక దీని తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం లో నటించబోతున్నాడు. ఇదిలా ఉంటే .. ఇప్పుడు ప్రభాస్ మరో అంశం లో సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

హరిత హారంలో భాగంగా తెరాస యం.పీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ పూర్తి చేశారు. తాజాగా తన పెదనాన్న కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ ను ప్రభాస్ స్వీకరించి పలు మొక్కలు నాటారు. మూడో విడత గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇటీవల ప్రభాస్ సంతోష్ కుమార్ తో కలిసి.. తన గెస్ట్ హౌస్ లో మొక్కలు నాటారు. అనంతరం ఈ ఇరువురు మొక్కలతో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్బంగా వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ఇక ఈ గ్రీన్ ఛాలెంజ్ ను రానా, రామ్ చరణ్, శ్రద్ధాకపూర్ లకు అందించారు.

వీడియో ను వీక్షించడానికి ఈ కింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://www.facebook.com/PulagamOfficial/videos/1125008784525060/?t=7

 

Leave a comment

error: Content is protected !!