మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే మూవీలో నటిస్తున్నారు. దీంతో పాటు రమేశ్ వర్మ డైరెక్షన్ లో ఒక థ్రిల్లర్ మూవీకి కూడా కమిట్ అయ్యారు. ఈ రెండు సినిమాలూ ప్రస్తుతం ప్రోసెస్ లో ఉండగానే.. రవితేజ కు ఒక క్రేజీ మల్టీస్టారర్ ఆఫర్ వచ్చింది. అది కూడా దగ్గుబాటి రానా తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం. అందులోనూ ఒక మలయాళ సూపర్ హిట్టు చిత్రం రీమేక్ . వీరిద్దరి తోనూ ఆ క్రేజీ మల్టీస్టారర్ ను తెరకెక్కించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్ టైన్ మెంట్స్ సన్నాహాలు చేస్తోందని సమాచారం.

ఈ ఏడాది మాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్టైన చిత్రాల్లో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ముందు వరుసలో ఉంది. యంగ్ సూపర్ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్, విలక్షణ నటుడు బిజుమీనన్ పోటా పోటీగా నటించిన ఈ సినిమా .. ఆ ఇద్దరి పాత్రల ఇగో క్లాషెస్ నేపథ్యంలో తెరకెక్కింది. ఒక నిజాయితీ కలిగిన ఒక పోలీసాఫీసర్ కు, రాజకీయ వర్గాల్లో బాగా పలుకుబడి కలిగిన ఒక వ్యాపారీకి ఒకానొక సందర్భంలో జరిగిన ఒక సంఘటన ఇద్దరినీ బాగా బాధిస్తుంది. దాని వల్ల ఆ ఇద్దరి మధ్యా రాగద్వేషాలు చెలరేగుతాయి. దాంతో  జీవితాల్లోనూ కొన్ని అనుకోని పరిణామాలు తలెత్తుతాయి. చివరికి తమ సమస్యను వారిద్దరూ ఎలా పరిష్కరించుకున్నారు అనేదే ఈ సినిమా కథాంశం. నిజానికి ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చడం చాలా పెద్ద సవాలే. అంతేకాదు ఇందులో పోలీస్‌గా రానా, రవితేజలలో ఎవరు నటిస్తారు? అన్న దాన్ని బట్టి ఆయా పాత్రల్లోనూ చాలా మార్పులు చెయ్యాల్సి ఉంటుంది. అందుకే కథలోని ఫీల్‌ను ఏమాత్రం చెడగొట్టకుండా, తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా మార్పులు చెయ్యగల దర్శకుడి కోసం వేట సాగిస్తోంది సితార సంస్థ. లాక్‌డౌన్‌ తర్వాత ఈ రీమేక్‌ విషయమై ఓ స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 

Leave a comment

error: Content is protected !!