యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ తో కలిసి నటిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఇప్పటివరకూ చిత్రీకరణను నిలుపు చేసిన ఈ సినిమా టీమ్ .. తదుపరి షెడ్యూల్ ను త్వరలోనే ప్లాన్ చేస్తున్నారు.  ఇదిలా ఉంటే. తారక్ నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది. ‘కేజీఎఫ్’ తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా ఉండనుండడం విశేషం. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి .. ఎప్పటినుంచో  వార్తలొస్తున్నప్పటికీ.. అందులో నిజానిజాలేంటో తెలియలేదు. అయితే మొన్న తారక్ పుట్టిన రోజున ప్రశాంత్ నీల్ చేసిన ట్వీట్ ను, నిన్న ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీస్ వారు చేసిన  ట్వీట్ ను పరిశీలిస్తే ..   ఈ  సినిమా ఖచ్చితంగా ఉండంబోతోతందని అర్ధమవుతోంది.  

తారక్‌ జన్మదినం సందర్భంగా ప్రశాంత్‌ ఆయనకు ట్వీట్‌ చేస్తూ.. ‘‘ఎన్టీఆర్‌ న్యూక్లియర్‌ ప్లాంట్‌. ఆయన చుట్టూ ఉన్న రేడియేషన్‌ను ఎదుర్కోవడానికి ఈసారి నేను రేడియేషన్‌ సూట్‌లో వాస్తను’’ అన్నారు. ఇప్పుడు తాజాగా ప్రశాంత్‌ నీల్‌కు మైత్రీ మూవీస్‌ సంస్థ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ‘‘త్వరలో రేడియేషన్‌ సూట్‌లో కలుద్దాం’’ అని ట్వీట్‌లో రాసుకొచ్చింది.  ఈ నేపథ్యంలో ఇప్పుడీ రేడియేషన్‌ అన్న పదంపై నెట్టింట చర్చ మొదలైంది. ప్రశాంత్‌ – మైత్రీ సంస్థలు తరచూ ఆ పదాన్నే ప్రత్యేకంగా కోట్‌ చేస్తూ మాట్లాడుతుండటంతో.. దాని ద్వారా చిత్ర టైటిల్‌ లేదా కథకు సంబంధించి ఓ నిగూఢమైన క్లూ ఏదో ఇస్తున్నారన్న వాదనలు నెట్టింట వినిపిస్తున్నాయి.

 

Leave a comment

error: Content is protected !!