అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై… సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా వచ్చి అప్పుడే 5నెలలు దాటుతున్నా.. దాని  సంచలనం ఇంకా ఆగలేదు. ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో ఇప్పటికీ ఇంకా.. హిట్స్ మీద హిట్స్ దక్కించుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ చిత్రంలోని ‘‘బుట్టబొమ్మ..’’ గీతానికి అందులో బన్ని వేసిన స్టెప్పులకు నెట్టింట తెగ ఆదరణ దక్కుతోంది.

పలువురు బాలీవుడ్‌ తారలు, క్రికెట్‌ క్రీడాకారులు సైతం బుట్టబొమ్మ పాటకు తమదైన స్టైల్‌లో స్టెప్పులేసి ముచ్చట తీర్చుకున్నారు. తాజాగా ఈ పాట మరో అరుదైన మైలురాయిని దాటింది. ఈ పాట యూట్యూబ్‌లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని దాదాపు 200మిలియన్స్‌ మంది వీక్షించారు. అంటే దాదాపు 20 కోట్ల మంది వీక్షించారన్న మాట. ఇటీవల కాలంలో తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోనే ఈస్థాయి ఆదరణ దక్కించుకున్న గీతాల్లో ఒకటిగా నిలిచింది ‘బుట్టబొమ్మ’’ .

 

Leave a comment

error: Content is protected !!