‘సరిలేరు నీకెవ్వురు’ బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు నిజానికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించాలి. కానీ కథ విషయంలో కాంప్రమైజ్ కాని మహేశ్ ఆ సినిమాని పక్కన పెట్టి.. పరశురామ్ కు అవకాశమిచ్చాడు. తనకిచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని .. మహేశ్ కు ఇమేజ్ కు సరిగ్గా సరిపోయే ఒక అదిరిపోయే కథను తెరమీద ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు పరశురామ్. ఇక ఈ సినిమాను సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు  అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ఈ సినిమాకు ‘సర్కారు వారిపాట’ అనే వైవిధ్యమైన టైటిల్ ను ఖాయం చేశారు. టైటిల్ ఫస్ట్ లుక్ ను ఈ సందర్భంగానే విడుదల చేశారు. చెవికి పోగు పెట్టుకొన్న మహేశ్ బాబు ప్రొఫైల్  లుక్  అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటోంది. 

స్కిప్టులో ఇటు మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే విధంగా సన్నివేశాలు రాసుకున్నాడట పరశురామ్. అందులో భాగంగా ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉంటుందని.. మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌‌గా కనిపించడమే కాదు.. కాలేజ్ స్టూడెంట్‌గాను అదరగొట్టనున్నాడట. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన కియారా అద్వానీ  ఫైనల్ అయ్యిందట. ఈ చిత్రాన్ని మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ ప‌తాకాలు కలిసి నిర్మిస్తున్నాయి. మరి ‘సర్కారు వారిపాట’ మహేశ్ ఏ రేంజ్ లో పాడతాడో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!