ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ఇప్పటికే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీసిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా మరో టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రశాంత్ వర్మ  ఈ సినిమా ప్రీ లుక్ గురించి   ట్వీట్ చేశాడు. అన్నట్టుగానే  కరోనా మూవీకి సంబందించిన ప్రీ లుక్ ను ఈ రోజు  విడుదల చేశాడు.

కోరలు సాచిన ఒక పెద్ద విష సర్పం పాయింటాఫ్ వ్యూలో కొండా రెడ్డి బురుజు రివీల్ అయింది. దాని పక్కనే తెలుగు తల్లి విగ్రహం.. ఆ పక్కన ట్రాఫిక్ లైట్స్ . చూస్తుంటే.. కర్నూల్ నగరానికి కరోనా వైరస్ సోకిందని ఈ ప్రీ లుక్ ను బట్టి అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా కరోనా వైరస్ మీద కాకుండా.. కరోనా వైరస్ బారిన పడిన వారికి వాక్సిన్ ఇచ్చి కాపాడడం అనే థీమ్ తో తెరకెక్కుతుండడం విశేషం. ఒక వేళ కరోనా వైరస్ కు వేక్సిన్ వస్తే .. ఎలా ఉంటుందనే ఆలోచనతో తనదైన శైలిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఇంకా టైటిల్ రివీల్ చేయని ఈ సినిమా ప్రశాంత్ వర్మకు ఏ స్థాయిలో పేరు తీసుకొస్తుందో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!