కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మన దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. దీని కారణంగా ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ముఖ్యంగా దాదాపు రెండునెలలకు పైగానే చిత్ర పరిశ్రమలో ఏవిధమైన షూటింగ్స్ లేకపోవడంతో .. చిత్ర సీమతో పాటు బుల్లితెర కార్మికులకు పూట గడవడమే కష్టంగా మారింది. ఇప్పుడు వారిని ఆదుకోవడానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముందుకొచ్చాడు.

అక్షయ్‌ కుమార్‌ వీరి కోసం 45 లక్షల రూపాయలు సహాయం చేశాడు. ఈ మొత్తాన్ని ఆయన సినీ మరియు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ కు అందజేశారు. అక్షయ్‌ ఇప్పటికే తనవంతు పీఎమ్‌ కేర్స్ ఫండ్‌ కూడా సాయం చేశారు. ఇక ముంబైకి చెందిన పోలీసుల కోసం 2 కోట్ల రూపాయలు, అంతేకాదు పీపీఇ కిట్ల కోసం ముంబై మునిపల్‌ కోఆపరేషన్‌ వారికి 3 కోట్ల రూపాయలు ఇచ్చాడు. ఇలా అక్షయ్‌కుమార్‌ కరోనా కష్ట కాలంలో చాలా వరకు తనవంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. అక్షయ్‌కుమార్‌ మంచి మనసుకు బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.

 

 

Leave a comment

error: Content is protected !!