మహానటి చిత్రంతో నేషనల్ అవార్డు కైవసం చేసుకొని,  సౌత్ లో తన కీర్తిని రెట్టింపు చేసుకుంది మల్లూ కుట్టిన కీర్తి సురేశ్. ప్రస్తుతం రజనీకాంత్ సరసన అణ్ణాత్త లోనూ, నితిన్ రంగ్ దే లోనూ నటిస్తోన్న అమ్మడు . నగేశ్ కుకునూరు దర్శకత్వంలో గుడ్ లక్ సఖి అనే సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో .. సోషల్ మీడియాలో తన యాక్టివిటీని పెంచుకుంది.

ఈ నేపథ్యంలో కీర్తి సురేశ్..  ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు కీర్తిని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించే వారి సంఖ్య అక్షరాల యాభైలక్షలను దాటేసింది. ఈ సందర్భరంగా కీర్తి అభిమానుల కోసం  ఓ వీడియోను తయారు చేసి షేర్‌ చేసింది. వీడియోలో కీర్తి ఎటువంటి మేకప్‌ లేకుండా సహజమైన అందంతో తన పెంపుడు కుక్కతో సందడి చేసింది. అంతేకాదు..‘‘ఇప్పుడు నా కుటుంబం 5 మిలియన్లకు చేరింది. నేను మీ ప్రేమకు నేను కృతజ్ఞలను చెప్పకుండా ఉండలేను’’ అంటూ ట్విట్‌ చేసింది.

 

Leave a comment

error: Content is protected !!