శంకర్ ‘బోయ్స్’ సినిమాతో తొలిసారిగా దక్షిణాది తెరమీద మెరిసింది అందాల జెనీలియా. ఆ తర్వాత ‘సాంబా, సై, నా అల్లుడు, హ్యాపీ లాంటి  చిత్రాల్లోనూ  నటించి మెప్పించిది అమ్మడు. అయితే ‘బొమ్మరిల్లు’ చిత్రంలోని హాసిని పాత్రతో అమ్మడు మరింతగా క్రేజీ హీరోయిన్ అయిపోయింది . ఆ సినిమా సక్సెస్ క్రెడిట్  తో మరిన్ని మంచి చిత్రాల్లో నటించే అవకాశాలు అందుకుంది. 2012 లో రానా హీరోగా వచ్చిన ‘నా ఇష్టం’ అమ్మడి ఆఖరి చిత్రం. ఆ సినిమా తర్వాత హిందీ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్ళాడి టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది జెనీలియా.

అయితే వివాహం అనంతరం జెనీలియా చాలా కాలం  నటనకు దూరంగా ఉంది. రీ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె రీ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చిరంజీవి కథానాయకుడుగా ‘లూసీఫర్‌’ రీమేక్‌ తెరకెక్కనుంది. సుజిత్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇందులోని ముఖ్యమైన పాత్ర ఉందని, దానికోసం జెనీలియాను సంప్రందిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ సినిమా ప్రకటించారు. ఈ కథను మలుపు తిప్పే కీలక పాత్ర కోసం కూడా జెనీలియాను ఎంపిక చేసే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.

Leave a comment

error: Content is protected !!