కథానాయకుడు మంచు విష్ణు సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు.  ఆకలి తీర్చే రైతుల్ని కలిసే అవకాశం వచ్చింది కానీ కుటుంబానికి దూరమై దేశానికి భద్రత ఇచ్చే జవాన్లని కలిసే అదృష్టం ఎప్పుడూ కలగలేదన్నాడు. ఆర్మీలో తెలుగు జవాన్ల వీరత్వాన్ని, వాళ్ళ త్యాగాన్ని చూపే వీడియోలు, ఫొటోలు ఎవరి దగ్గరైనా ఉంటే తనకు పంపించాల్సిందిగా ఆయన కోరారు.’బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, మన ఆకలి తీర్చే రైతన్న, తన కుటుంబానికి దూరమై మన భద్రత కోసం కాపలా కాసే వీర జవాన్‌. ఈ ముగ్గురికి లభించాల్సిన గుర్తింపు దక్కట్లేదని నా భావన.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శనీయులైన కన్నతల్లుల్ని, కష్టజీవులైన రైతన్నలను కలిసే అదష్టం నాకు కలిగింది. కానీ వీర జవాన్లను కలిసే అదష్టం నాకెప్పుడూ కలగలేదు. ఇప్పుడు భారత ఆర్మ్డ్‌ ఫోర్సెస్‌ గురించి తెలుసుకునే కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాను. ప్రపంచంలో ఎంతో సమర్థవంతమైన భారత ఆర్డ్మ్‌ ఫోర్సెస్‌లో అడుగుపెట్టి మన దేశాన్ని గర్వించేలా చేసి, ఆర్మీలో తమ ముద్రవేసిన తెలుగు వీరజవాన్ల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగ్గరైనా మన తెలుగు వీరసైనికుల త్యాగాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, వాళ్ల పేర్లు ఉంటే నా సోషల్‌ మీడియా అకౌంట్‌కి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచంతో వాళ్ల వీరకథల్ని పంచుకుందాం’ అని విష్ణు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!