కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సామాన్య ప్రజానీకం పెళ్ళిమాటే తలపెట్టడం లేదు. ఒక వేళ చేసుకోవాలనుకున్నా  ప్రభుత్వం నియమ నిబంధనలకు కట్టుబడి, అతి తక్కువ మంది అతిథులతో  ఆ మంగళ కార్యాన్ని సింపుల్ గా లాగించేయాలి. ఈ రూల్స్ కు అనుగుణంగా మొన్నటికి మొన్న యంగ్ హీరో నిఖిల్ తన పెళ్ళిని నిరాడంబరంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో సినీ సెలబ్రిటీ వచ్చి చేరాడు.అతడే జబర్దస్త్ మహేశ్.

తూర్పుగోదావరి యాసతో, సన్నగా రివటలా ఉండే.. మహేశ్ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆ క్రెడిట్ తోనే మహానటి, రంగస్థలం లాంటి సూపర్ హిట్టు చిత్రాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవలే ఆయన ఓ ఇంటివాడయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలోని శివకోడు గ్రామానికి చెందిన పావనిని ఆయన వివాహమాడారు. గురువారం ఉదయం ఈ జంట ఒక్కటైంది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న కారణంగా అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

Leave a comment

error: Content is protected !!