ప్రస్తుతం  కరోనా వైరస్ కారణంగా మన దేశం లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ డిస్టెన్స్ ను మస్ట్ గా పాటించాల్సిన ఈ సమయంలో అతి తక్కువ మంది అతిథులతో పెళ్ళిళ్ళు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెళ్లిళ్లకు 50 మంది అతిధులు మాత్రమే ఉండాలన్నది ప్రభుత్వాల నిబంధన. లాక్ డౌన్ పొడిగింపు కారణంగా అతిధుల సంఖ్యను 20 నుంచి 50కి పెంచింది కేంద్రం. అయితే ఈ నియమాన్ని పాటిస్తూనే యువహీరో నిఖిల్ ఎంతో నిరాడంబరంగా పెళ్లాడాడు. నిఖిల్ సిద్ధార్థ్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.

తన ప్రేయసి డాక్టర్ పల్లవి వర్మను నిఖిల్ పెళ్లాడేశాడు. శామిర్ పేటలోని ఓ ప్రయివేటు అతిథి గృహంలో ఈ జంట పెళ్లి అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది.టాలీవుడ్ లో ఉజ్వల భవిష్యత్ ఉన్న హీరోగా నిఖిల్ పేరు మార్మోగుతోంది. అతడి సెలెక్షన్స్- హార్డ్ వర్క్- లక్ ఈ స్థాయికి తెచ్చాయి. ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు.

Leave a comment

error: Content is protected !!