ప్రస్తుతం దేశవ్యాప్తంగా  కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దాదాపు 50 రోజులనుంచి ఎవరింటికి వారే పరిమితమైపోయారు. దీని ప్రభావంతో చాలా మంది సామాస్యులు అన్ని విధాలుగానూ అవస్థలు పడుతున్నారు.  ఈ తరుణంలో పలువురు సెలబ్రిటీస్ తమ ఉదారత చాటుకుంటూ.. తమకు తగ్గ స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు.  టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సెలబ్రిటీస్ అందరూ కరోనా పై యుద్ధానికి సిద్ధమంటూ.. చేయూతనందిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి బాలీవుడ్ హాట్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా చేరిపోయింది.

తాజాగా ఈ అమ్మడు కరోనా వైరస్‌పై (కోవిడ్‌-19) పోరాటానికి తనవంతుగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 18 మిలియన్ల అనుచరగణం ఊర్వశికి ఉంది. ఇంతమంది అభిమానుల సహకారంతో ఓ డ్యాన్‌ క్లాస్‌ని ఏర్పాటు చేసింది. దాంతో ఆమెకు వారి నుంచి సహాయసాకారాలు అందాయి. ఈ క్రమంలో ఊర్వశి రౌతేలా ఇన్‌స్టాగ్రామ్‌ తన సందేశాన్ని తెలుపుతూ..‘‘ఇలాంటి కష్ట సమయాల్లో సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. 25 మిలియన్ల అనుచరగణం నాకు 18 మిలియన్ల అనుచరగణం డ్యాన్స్‌క్లాస్‌లో పాల్గొన్నారు. వారందరి సాయంతో 5 కోట్ల రూపాయలు వసూళు చేశాను. ఈ సాయం చిన్నదే కావచ్చు. మా ప్రయత్నం మాత్రం వృధా కాలేదు. కోవిడ్‌పై పోరాటానికి అందరి సాయం అవసరం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాయం చేస్తున్న ప్రతిఒక్కరికి నా కృతజ్ఞతలు’’ అంటూ పేర్కొంది.

Leave a comment

error: Content is protected !!