అందాల అనుష్క కథానాయికగా, తమిళ హీరో మాధవన్ ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ‘నిశ్శబ్దం’. ఒక హత్యను కళ్ళారా చూసిన మూగ, బధిర అమ్మాయి ఎదుర్కొన్న సమస్యల సమాహారమే చిత్రకథ. ఈ సినిమా నిజానికి ఈ పాటికి ఏఫ్రిల్ 2న విడుదల అవ్వాల్సింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంతవరకూ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయితే ఈ సినిమా ను డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే విడుదల చేసేందుకు నిర్మాతలకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే విడుదల చేస్తాం అని ఇప్పటికే ఈ చిత్ర బృందం అధికారిక ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. కానీ, మరోవైపు దీన్ని ఓటీటీ నుంచి విడుదల చేయడానికి తెర వెనుక అన్ని ఒప్పందాలు జరిగిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ చిత్ర హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుందని, ఇందుకోసం దాదాపు రూ.30కోట్ల మొత్తాన్ని వెచ్చించినట్లు వార్తలొస్తున్నాయి. మరి నిశ్శబ్దం చిత్రం నిజంగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతుందో లేదో చూడాలి.

Leave a comment

error: Content is protected !!