కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్ తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు.
కరోనా వల్ల చిత్రీకరణలు లేక ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సినీ కార్మికులకు అగ్ర దర్శకుడు కొరటాల శివ అండగా నిలిచారు. వారి సంక్షేమం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సిసిసి)’కి తన వంతుగా రూ.5లక్షల విరాళం ఇస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘‘ఇది సాయం కాదు. తోడు. ఈ అందమైన చిత్ర సీమ కుటుంబంలో నేనూ ఓ భాగమే. మనమంతా కలిసి పోరాడదాం’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు కొరటాల.

Leave a comment

error: Content is protected !!