కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఒణికిస్తోన్న సంగతి తెలిసిందే. మార్చ్ 23 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోన్న ఈ తరుణంలో సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు వరకూ ఇంటికే పరిమితమయ్యారు. కొందరు సినీ సెలబ్రిటీస్  కరోనా బాధితులకు విరాళాలు విరివిగా అందించారు. మరికొందరు నిత్యావసర వస్తువులు అందించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్స్  వాటితో పాటు ప్రజలకు సందేశాల్ని కూడా అందిస్తూండడం విశేషంగా మారింది.

చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ..  కరోనా ను ఎదుర్కొనేందుకు వినూత్నంగా సందేశం ఇచ్చారు. స్టేహోం స్టేసేఫ్ అంటూ.. అల్లు అరవింద్, అల్లు శిరీష్, రామ్ చరణ్, సుస్మిత, కళ్యాణ్ దేవ్, వరుణ్ తేజ, సాయిధరమ్ తేజ , నిహారిక, ఉపాసన, శ్రీజ, తదితరులు ఇంట్లో యుద్ధం చేస్తాం, క్రిమిని కాదు ప్రేమను పంచుతాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారతీయులు ఒకటై.. భారత్ ను గెలిపిస్తాం. అని ప్లకార్డులు పట్టుకొని ఫోటోలకు పోజులిచ్చారు. చిరంజీవి ఈ ఫోటోస్ ను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసి .. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

 

Leave a comment

error: Content is protected !!