కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్స్  తమ తమ స్థాయికి తగ్గట్టుగా భూరి విరాళాలిచ్చారు. అయితే వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వనీదత్ కూడా రూ. 20లక్షల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడాయన మరో రూ. 5లక్షలు అదనంగా విరాళం ప్రకటించడం విశేషంగా మారింది. టాలీవుడ్ లో ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ సంస్థకు లశ్వనీదత్ రూ. 5లక్షలు విరాళంగా ఇవ్వబోతున్న్టటు ట్విట్టర్ వేదిక గా ప్రకటించారు.  సిసిసి నిజంగా ప్రశంసించదగ్గదని .. సినీ కార్మికులకు తను నుంచి కూడా సహాయ సహకారాలుంటాయని అశ్వనీదత్ ఆ ట్వీట్ లో తెలిపారు.

Leave a comment

error: Content is protected !!