నావల్ కరోనా వైరస్ కోవిడ్ 19 ప్రస్తుతం ప్రపంచం అంతటికీ శత్రువు. ఇప్పటికే ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే.. లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం.  బైటికి రాకుండా ఎవరింట్లో వారుండడమే అన్నటికన్నా ఉత్తమమైన మార్గం. అందులో భాగంగా  కరోనాపై  పోరాటానికి సూచకంగా కొవ్వొత్తులు, దీపాలతో సంఘీభావం ప్రకటించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా మంచి స్పందన కనిపించింది. మనమంతా ఒక్కటే అనే భావన కల్పించడానికి చేసిన ప్రయత్నానికి తెలుగు సినీ పరిశ్రమ అద్భుతంగా స్పందించింది.

ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత భారీ సంఖ్యలతో దీపాలు వెలిగించి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది స్టార్స్ దీపాలు వెలిగించి మరో దీపావళిని తలపించారు. ఇక  ప్రధాని పిలుపు మేరకు లైట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు , అతడి ఫ్యామిలీ దీపాలు వెలిగించి తమ సంఘీభావాన్ని తెలిపారు.  మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ తో పాటు తనయుడు గౌతమ్ కృష్ణ, తనయ సితార సైతం దీపాలు వెలిగించడం విశేషం.

 

Leave a comment

error: Content is protected !!