అందం, అభినయం , ప్రతిభ, పాటవాలు ఉంటే ఏం లాభం. స్పందించే హృదయం లేనప్పుడు. సమస్య వచ్చినపుడు సాయం చేయడానికి ముందుకు రానప్పుడు ఎందుకొచ్చిన స్టార్ డమ్?  లావణ్య త్రిపాఠీ లాంటి పెద్దగా అవకాశాల్లేని హీరోయిన్ మినహా టాలీవుడ్ లో మరే హీరోయిన్ ముందుకు రాలేదు. కరోనా విషయంలో ప్రభుత్వం ద్వారా లేదా సిసిసి ద్వారా సహాయం అందించడానికి. అక్కినేనివారి కోడలు  సమంత కావచ్చు, తెలుగునాట పాపులర్ అయిన అనుష్క, రష్మిక, పూజా హెగ్డే, రకుల్ ఇలా ఎవ్వరూ ఓ  రూపాయి విరాళం కూడా ప్రకటించలేదు. 

అసలు కనీసం ఓ ప్రకటన లేదు, ఓ విడియో లేదు. మిగతా సెలబ్రిటీలు చేస్తున్నట్లు కనీసం కరోనాపై ఒక్క మాటకూడా మాట్లాడలేదు. హ్యాపీగా సెలవులు ఎంజాయ్ చేస్తున్నట్లు వుండిపోయారు. ఇదిలా వుంటే మన టాలీవుడ్ వాళ్లు కోరి తెచ్చుకునే పరభాషా నటులు అనేక మంది వున్నారు. వీరు కూడా స్పందించిన పాపాన పోలేదు. ఇక్కడ వాళ్ల కంటే ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇచ్చి మరీ తెచ్చుకుంటారు. వాళ్లు ఇలాంటి టైమ్ లో మాత్రం మొహంచాటేస్తారు. మరి వారందరిమీద అన్ని విమర్శలొచ్చిన నేపథ్యంలోనైనా కరోనా బాధితులపై స్పందించి తమ వంతు విరాళాలు ప్రకటిస్తారో లేదో చూడాలి.

Leave a comment

error: Content is protected !!