కరోనా వైరస్ భయంతో ప్రపంచమంతా ఒణికిపోతున్న సంగతి తెలిసిందే. దాంతో ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ నియమాలకు కట్టుబడి లాక్ డౌన్ ను ఫాలో అవుతోంది. ఇక కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య ఇండియాలో కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ కోసం బడా వ్యాపార వేత్తలు సినీ ప్రముఖులు పెద్ద మనసుతో విరాళాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు.  అలాంటి వారిలో ఎప్పుడూ ముందుండే మనసున్న మారాజు మహేశ్ బాబు . అతడు ఆల్రెడీ కరోనా పై యుద్ధానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షలు విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మహేశ్ బాబు టాలీవుడ్ వర్కర్స్ సంక్షేమార్ధం మరో రూ. 25 లక్షలు విరాళం ప్రకటించి మానవత్వం చాటుకున్నాడు . దాంతో టాలీవుడ్ లో పలువురు మహేశ్ బాబు మంచి మనసును వేనోళ్ల పొగుడుతున్నారు. ఇప్పటివరకూ మహేశ్ బాబు మొత్తం రూ. 1కోటి 25 లక్షల విరాళం ప్రకటించి శభాష్ అనిపించుకున్నాడు.  

Leave a comment

error: Content is protected !!