కరోనా వైరస్ ప్రపంచ దేశాల్ని ఒణికిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మనదేశంలో కరోనాను అరికట్టేందుకు కేంద్రప్రభుత్వ పిలుపు మేరకు నిన్నటి రోజున దేశ ప్రజలంతా  జనతా కర్ఫ్యూ ను విధిగా పాటించిన సంగతి తెలిసిందే. సామాన్యుల దగ్గరనుంచి సినీ ప్రముఖుల వరకూ కరోనా కోసం అహర్నిశలు కృషి చేస్తూ.. రోగులకు సేవ చేస్తున్న వైద్యులకు కృతజ్నతలు తెలుపుతూ.. జనతా కర్ఫ్యూ విధించిన రోజు సాయంత్రం 5గంటలకు జనమంతా కరతాళ ధ్వనులతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

వీరిలో  చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, యన్టీఆర్, అల్లు అర్జున్ , పూరీ జగన్నాథ్, చార్మి, అనిల్ రావిపూడి, తమన్నా , పూజా హెగ్డే , రణవీర్ సింగ్, దీపికా, అక్షయ్ కుమార్, హృతిక్ రోష,, మోహన్ బాలు , మంచు మనోజ్, అశ్వనీదత్, వెంకటేశ్ ,  మొదలగు వారంతా చప్పట్లతో తమ కృతజ్నతల్ని తెలిపారు.  కరోనా వైరస్ నిర్మూలనకు నడుం బిగించిన వారికి సాల్యూట్ చేస్తూ వారిపై పోస్టులు పెట్టారు. 

 

Leave a comment

error: Content is protected !!