‘సాహో’ చిత్రం తర్వాత డార్లింగ్ ప్రభాస్ నటిస్తోన్న మరో పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. జిల్ ఫేమ్ రాధాకృష్ణకమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఓ డియర్, రాధే శ్యామ్ టైటిల్స్ లో ఒకటి ఖాయం చేయనున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఫ్రెష్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఇటీవల జార్జియాలో ఓ భారీ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

ప్రభాస్ , పూజా హెగ్డే తో పాటు .. సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నీవేశాలు ఆ షెడ్యూల్ లో చిత్రీకరించారు. ఈ విషయాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ లో తెలియజేశారు. అాలాగే ఈ సినిమాకి సబంధించిన ఫస్ట్ లుక్ త్వరలోనే రానున్నదని కూడా ఇందులో మెన్షన్ చేశారు.  మే నెల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రభాస్  20వ చిత్రంగా అతడి కెరీర్  లోనే చాలా ప్రత్యేకం. బహుభాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రభాస్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!