‘బాహుబలి, భాగమతి’ చిత్రాల తర్వాత స్వీటీ అనుష్క నటిస్తోన్న ఇంటెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. మూగ, బధిర యువతిగా .. తాను చూసిన ఒక హత్యకు ప్రత్యక్ష సాక్షిగా ఒక ఆసక్తికరమైన పాత్రను పోషిస్తోంది అనుష్క. ఆమె భర్తగా మాధవన్ నటిస్తూండగా.. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా అంజలి నటిస్తోంది. హారర్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదల కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్ తో అందరిలోనూ ఆసక్తి కలుగచేసిన ఈ సినిమా యూనిట్ ..  ప్రచారాల్ని జోరుగానే చేస్తోంది. ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనుష్క లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

ట్రాలెలింగ్ బ్యాగ్ తో ఒక ఎయిర్ పోర్ట్ లో రివీలైన అనుష్క అందమైన లుక్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. టిజి విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ‘నిశ్శబ్దం’ చిత్రం అనుష్కకు ఏ రేంజ్ లో సక్సెస్ అందిస్తుందో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!