Shopping Cart 0 items - $0.00 0

విచిత్రమైన కో – ఇన్సిడెన్స్

కొన్ని సార్లు కొన్ని విచిత్రాలు జరుగుతాయి. కో ఇన్సిడెంటే అయినా.. అది  ఆశ్చర్యంగా  ఆసక్తిని రేపుతుంది.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో అలాంటి ఓ కో ఇన్సిడెంట్ మెగాభిమానుల్ని అబ్బుర పరుస్తోంది. అదేంటంటే.. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్  ధ్రువ చిత్రంలో నటించాడు. తమిళ ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో మంచి వసూళ్ళే రాబట్టింది. సూరి దర్శకత్వ ప్రతిభ కు ఫిదా అయిన చెర్రీ.. వెంటనే  అతడి దర్శకత్వంలోనే తన ఓన్ బ్యానర్ లో మెగాస్టార్ తో సైరా ‘నరసింహారెడ్డి’ చిత్రం నిర్మించాడు. ఆ సినిమా తెలుగులో బ్రహ్మాండమైన వసూళ్ళు సాధించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఆచార్య అనే సామాజిక ఇతివృత్తం కలిగిన చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆగస్ట్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను కూడా రామ్ చరణే నిర్మిస్తూండగా.. కొరటాల దర్శకత్వానికి ముగ్ధుడైన చెర్రీ.. అతడి తదుపరి  చిత్రంలో హీరోగా నటిస్తున్నాడని ఆ సినిమా కూడా రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.  మొత్తానికి అప్పుడు సురేంద్రరెడ్డి విషయంలో చెర్రీ ఎలా రియాక్ట్ అయ్యాడో .. ఇప్పుడు కొరటాల శివ విషయంలో కూడా అలాగే రియాక్ట్ అవుతుండడం విశేషంగా మారింది.

Leave a comment

error: Content is protected !!