సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత తన ఫ్యామిలీతో ఫారిన్ టూర్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆఫ్టర్ టూర్.. తదుపరి చిత్రాన్ని ట్రాక్ మీదకు తెచ్చే బిజీ లో ఉన్నాడతడు.  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని నిన్నమొన్నటి వరకూ అందరికీ తెలిసిన అప్డేట్ . కానీ ఇప్పుడు కొన్ని సడెన్ ఛేంజెస్ జరిగినట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి చిత్రం కేన్సిల్ అయిపోయి .. సీన్ లోకి పరశురామ్ వచ్చినట్టు తాజా సమాచారం.

నిజానికి వంశీ పైడిపల్లి ఒక గ్యాంగ్ స్టర్ కథతో స్ర్కిప్ట్ రాస్తున్నానని దిల్ రాజు కు , మహేశ్ బాబు కు చెప్పాడట. దానికి దిల్ రాజు ఒప్పుకోవడంతో .. మహేష్ బాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తీరా వంశీ మహేశ్ కు ఫుల్ నెరేషన్ ఇచ్చినప్పుడు ఆ కథ తనకేమాత్రం నచ్చక షాక్ అయ్యాడట. అదే కథను దిల్ రాజు కూడా విని .. తనకూ నచ్చలేదని చెప్పాడట. దాంతో ఇప్పుడు వంశీ దర్శకత్వంలోని సినిమాను ఆపేశారు.  అయితే ఇప్పటికప్పుడు దిల్ రాజ్ ప్రొడక్షన్ లో సినిమా చేసే వేరే దర్శకుడు ఎవరా అని శోధిస్తే..  పరశురామ్ ఆప్షన్ గా కనిపించాడు. కానీ పరుశురామ్ ప్రస్తుతం 14రీల్స్ ప్లస్ కు కమిట్ అయి, చైతన్యతో సినిమా ప్రకటించేసారు. అది వెనక్కు జరిపి ఈ సినిమా చేయాలి. దానిపై ఇప్పుడు డిస్కషన్ల స్టార్ట్ అయ్యాయి. రెండు బ్యానర్లను కలపడమా? లేక 14రీల్స్ కు మరో సినిమా హామీ ఇచ్చి  వెనక్కు వుంచడమా? ఏం చేయాలి అన్నది కూడా తేలాల్సి వుంది. లేదా మైత్రీ కి కాకుండా 14రీల్స్ కే సినిమా చేయడమా? ఈ విషయంలో అప్పుడే ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించేసారు.

Leave a comment

error: Content is protected !!