యంగ్ హీరో నితిన్, రష్మికా మందణ్ణ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా భీష్మ. ఫరెవర్ సింగిల్ అనే ట్యాగ్ లైన్ తో విడుదలకు ముందే ఆసక్తి రేపుతోన్న ఈ సినిమా ఈ నెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రచారాలతో ఇప్పటికే బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ ను ఈ సాయంత్రం విడుదల చేశారు మేకర్స్. టైటిల్ ను  బట్టి  జీవితాంతం పెళ్ళి చేసుకోనని ప్రతిన బూనిన భీష్ముని కథగా అనిపించినా..  చిత్ర కథ వేరే టింట్ తో ఉంది.

‘ధర్మరాజ్, దుర్యోధన్, దుశ్శాశన్ , యమధర్మరాజ్ , శకుని ఇలా పురాణాల్లో ఎన్నో పేర్లుండగా.. పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లే ఏమో ఒక్కరు కూడా పడట్లేదు నాకు’.  అంటూ నితిన్ చెప్పే డైలాగ్ తో .. కొన్ని లవ్ సీన్స్ మీద ట్రైలర్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత నితిన్ ఆఫీస్ లో వెన్నెల కిషోర్ అండ్ కో డైలాగ్స్ వినిపిస్తాయి. ఆ తర్వాత భీష్మ అనే బ్రాండ్ తో  .. సేంద్రీయ ఎరువుల కంపెనీ ఓనర్ అయిన కన్నడ నటుడు అనంత్ నాగ్ రివీల్ అయి.. ఎరువులు, పురుగుల మందుల పేరుతో విషప్రయోగం జరుగుతోంది. ఆపేద్దాం.. సేంద్రీయ వ్యవసాయానికి మారిపోదాం అంటూ డైలాగ్ చెబుతాడు. ఇంతలో అశ్వథ్థామ విలన్ జిషు సేన్ గుప్తా ఎంట్రీ ఇచ్చి.. ఆ సేంద్రీయ ఎరువుల కంపెనీ కు ఎగైనెస్ట్ గా తన కుయుక్తులు ప్రారంభిస్తాడు. ఆ తర్వాత నితిన్ , అనంత నాగ్ బ్యాచ్ ఆ విలన్ ను ఎదుర్కొనే స్కీములు ప్రారంభిస్తారు. మొత్తానికి ‘భీష్మ’ సినిమా అగ్రికల్చర్ కాన్సెప్ట్ తో కార్పోరేట్ సిస్టమ్ మీద సాగే ఒక యుద్ధం లా టర్న్ అయింది. చూస్తుంటే ఈ సినిమా  సమ్ థింగ్ స్పెషల్ అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఫ్యూచర్ ఏంటో తెలియాలంటే.. ఈ నెల 21 వరకూ ఆగాల్సిందే.

Leave a comment

error: Content is protected !!