Shopping Cart 0 items - $0.00 0

శోభన్ బాబుగా ‘అశ్వథ్థామ’ విలన్ ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి పురచ్చి తలైవి జయలలిత బయోపిక్ ‘తలైవి’ తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే.  యంగ్ డైరెక్టర్ ఎ.యల్. విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జయలలిత పాత్రను బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ పోషిస్తుండగా.. ఇంకా కరుణానిధిగా ప్రకాశ్ రాజ్, జయలలిత స్నేహితురాలు శశికళగా ప్రియమణి నటిస్తున్నారు. అయితే ఇందులో మరో ముఖ్యమైన పాత్ర టాలీవుడ్ అందాల నటుడు  శోభన్ బాబుది. అప్పట్లో శోభన్ కు, జయలలితకు సన్నిహిత సంబంధాలుండేవి అన్న రూమర్ ఉంది. ఈ మూవీలో ఆయనకు, జయలలితకు మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయట.  ఆ పాత్ర కోసం ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నారు. కానీ విజయ్ ప్రస్తుతం చాలా బిజీ గా ఉండంతో.. ఆ ప్లేస్ లో ఇప్పుడు మరో నటుడ్ని తీసుకోవాలని డిసైడయ్యారు మేకర్స్.

నాగశౌర్య హిట్ చిత్రం ‘అశ్వథ్దామ’ లో సైకో విలన్ గా నటించి మెప్పించిన జిషు సేన్ గుప్తా ను శోభన్ బాబు పాత్రకోసం ఎంపిక చేశారట. ఆమేరకు అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని సమాచారం. బెంగాలీ నటుడైన జిషు .. ఇప్పటికి దాదాపు 90 చిత్రాలకు పైగానే నటించాడు. వైవిధ్యమైన  అతడి నటనకు ఫిదా అయి.. దర్శకుడు విజయ్ జిషు నే శోభన్ బాబు పాత్రకు ఖాయం చేశాడని తెలుస్తోంది. విబ్రీ మీడియా, కర్ణ మీడియా బ్యానర్స్ పై విష్ణువర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ ‘తలైవి’  సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి శోభన్ బాబు గా జిషు ఎలా మెప్పిస్తాడో  చూడాలి.

Leave a comment

error: Content is protected !!