Shopping Cart 0 items - $0.00 0

ప్రభాస్ పై కన్నేసిన నాగ్ అశ్విన్

‘ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి’ చిత్రాలతో వరుస విజయాలందుకొని.. విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన ఇంటలెక్చువల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ . ఇప్పటి వరకూ అతడు  చేసినవి రెండే చిత్రాలు .. ఆ రెండిటికీ  చాలా గ్యాప్ ఇచ్చాడు . ఇప్పుడతడి మూడో చిత్రం కూడా అంతే గ్యాప్ తో రానుంది.  కాకపోతే   ఈ దర్శకుడు తన  తదుపరి చిత్రం ఎవరితో చేయాలనుకుంటున్నాడో తెలిసింది.  డార్లింగ్ ప్రభాస్ తో తన నెక్స్ట్ మూవీ చేయాలనుకుంటున్నాడట. త్వరలోనే ప్రభాస్  కు స్టొరీ లైన్ వినిపించబోతున్నాడు. అతడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే  .. ఈ కాంబో మూవీ ఈ ఏడాది చివరలో తెరకెక్కే అవకాశాలున్నాయి.

ఇప్పుడు  ప్రభాస్ తో సినిమాలు చేయాలని .. టాలీవుడ్ నుంచి కొరటాల శివ, బాలీవుడ్ నుంచి సిద్ధార్ధ్ ఆనంద్ రెడీ గా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ జిల్ రాధాకృష్ణ సినిమా ( ఓ డియర్ or రాధేశ్యామ్ ) షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అది కంప్లీట్ అయ్యే టైమ్ కు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్నాడట. కొరటాల శివ ప్రస్తుతం మెగా స్టార్ తో సినిమా చేస్తున్నాడు .. అది కంప్లీట్ అవడానికి చాలా టైమ్ పడుతుంది. అలాగే ప్రభాస్ కు ఇప్పుడప్పుడే బాలీవుడ్ కు వెళ్లే ఆలోచన లేదు. సో..  ఎటు చూసినా .. ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం నాగ్ అశ్విన్ కే దక్కేలా ఉంది. చూద్దాం .. ఏం జరుగుతుందో .

Leave a comment

error: Content is protected !!