యంగ్ హీరో నితిన్  ప్రస్తుతం..  ‘భీష్మ, రంగ్ దే’ చిత్రాల షూటింగ్ తో ఊపిరి సలపని బిజీలోఉన్నాడు. ఇప్పుడతడి తదుపరి చిత్రం దాదాపు ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో బ్లాక్ కామెడీగా తెరకెక్కి సూపర్ హిట్టు అయిన చిత్రం ‘అంధాధున్’. ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా నటించిన ఈ సినిమా రీమేక్ త్వరలో టాలీవుడ్ తెరమీదకు రాబోతోంది.  హీరోగా నితిన్ నటించబోతున్నట్టు అధికారికంగా కన్ఫామ్ అయింది.  నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఆ సినిమా రీమేక్ రైట్స్ ను ఇదివరకే తీసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో  సెట్స్ మీదకు వెళ్ళనుందని సమాచారం.

ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే నటించిన ఈ సినిమా స్ర్కీన్ ప్లే చాలా ఆశ్చర్యకరమైన రీతిలో .. ఆద్యంతం ట్విస్టులతో సాగుతుంది. పియానా ప్లేయర్ అయిన అంధ కథానాయకుడు ఒక సీనియర్ సినిమా నటుడి హత్యకు ప్రత్యక్ష సాక్షి అవుతాడు. దాని పర్యవసానంగా అతడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? అన్నదే చిత్ర కథ. మరి అంధుడిగా నితిన్ పెర్ఫార్మెన్స్ ఆయుష్మాన్ ఖురానా స్థాయిలో ఉంటుందో  లేదో చూడాలి.

Leave a comment

error: Content is protected !!