Shopping Cart 0 items - $0.00 0

కృష్ణవంశీకి నో చెప్పిన అరవిందస్వామి

సంగీత దిగ్గ‌జం ఇళ‌యరాజా కంపోజ్ చేసిన అసలేం గుర్తుకు రాదు నా క‌న్నుల ముందు నువ్వుండ‌గా.. అనే పాట ఇష్ట‌ప‌డని వారుండ‌రు. అంతఃపురం లోని ఈ పాట ఆ సినిమా హిట్ క్రెడిట్‌లో భాగం ద‌క్కించుకుంద‌నే చెప్పాలి. అంతఃపురం లాంటి సినిమా తీయాలంటే డైరెక్ట‌ర్‌కి గ‌ట్స్ తో పాటు చాలా సెన్సిబుల్ ఎమోష‌న్స్ ప్రొజెక్ట్ చేసే నేర్పు ఉండాలి. అలాంటి డైరెక్ట‌రే కృష్ణ‌వంశీ.
ఈ సినిమాలోని ఓ కీరోల్ కోసం త‌మిళ్ స్టార్ అర‌వింద్ స్వామిని క‌లిసారట కృష్ణ‌వంశీ. క‌థ చెప్పిన‌పుడు చాలా ఎగ్జ‌యిట్ అయ్యార‌ట అర‌వింద్ స్వామి. ఆ క్యారెక్ట‌ర్ చేయ‌డానికి చాలా ఇంట్రస్ట్ చూపాడ‌ట‌. కానీ లాంగ్వేజ్ ప్రాబ్ల‌మ్ కార‌ణంగా చేయ‌లేక‌పోయార‌ట‌. ఈ సినిమాని త‌మిళ్‌లో చేస్తే ఖ‌చ్చితంగా చేస్తాన‌ని కృష్ణ‌వంశీకి మాట ఇచ్చార‌ట అర‌వింద్‌స్వామి. అర‌వింద్ స్వామి చేయ‌క‌పోవ‌డంతో మ‌న ఫ్యామిలీ హీరో జ‌గ‌ప‌తిబాబును చేయ‌మ‌ని అడిగార‌ట‌. అప్ప‌టికే ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న జ‌గ‌ప‌తి బాబు మ‌ళ్లీ అలాంటి సాఫ్ట్ హ‌జ్బెండ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం ఇష్టం లేక నో చెప్పాడ‌ట‌. వీరిద్ద‌రితో కుద‌ర‌క‌పోవ‌డంతో సాయి కుమార్‌తో
చేయించాడు కృష్ణ‌వంశీ.

Leave a comment

error: Content is protected !!