Shopping Cart 0 items - $0.00 0

నాని గారితో మళ్లీ చిన్నిగారు

తమిళ, మలయాళ ప్రేక్షకుల్నే  కాకుండా.. తెలుగువారినీ తన టాలెంట్ తో ఫిదా చేసేసింది పింపిల్స్ బ్యూటీ సాయిపల్లవి. ప్రస్తుతం శేఖర్ కమ్మల ‘లవ్ స్టోరీ’ లో నాగచైతన్యతో జోడీ కడుతోన్న ఈ బ్యూటీ.. రానా  ‘విరాటపర్వం’ లోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది  ఈ రెండూ ప్రస్తుతం సెట్స్ మీదుండగా.. అవి ఈ ఏడాదే విడుదల కానుండడం విశేషం. ఇక సాయిపల్లవి మరో సారి నానీతో స్ర్కీన్ షేర్ చేసుకోనుందని సమాచారం.

నానీ హీరోగా ‘టాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ ఒక సినిమా తెరకెక్కించ నున్నాడు. ఇందులో కథానాయికగా సాయిపల్లవిని ఖాయం చేసినట్టు వినికిడి. యం.సీ.ఏ చిత్రంతో నానీ, సాయిపల్లవి కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయిన నేపథ్యంలో ఈ జోడీని రిపీట్ చేయనున్నాడట దర్శకుడు. ప్రస్తుతం నాని – సాయి పల్లవి చేస్తున్న సినిమాలు పూర్తికాగానే, రాహుల్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్ళనుందట. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనున్నట్టు టాలీవుడ్ టాక్. మరి ఈ సారి నానీగారు, చిన్నిగారూ.. ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!