టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’.  దర్శక ధీరుడు రాజమౌళి, తారక్, చెర్రీల అరుదైన కలయికలో దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ హిస్టారిక్ ఫిక్షనల్ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గత వారం రోజులుగా బాలీవుడ్ యాక్షన్ జాక్సన్ అజయ్ దేవ్ గణ్ తో తారక్, చెర్రీ పాల్గొన్న పలు ఆసక్తికరమైన సన్నివేశాల షూటింగ్  జరుగుతోంది. ఈ సందర్భంగా షాట్ గ్యాప్ లో మన ట్రిపుల్ ఆర్ .. అజయ్ దేవ్ గణ్ తో ఇలా ఫోటోలకు పోజులిచ్చారు. ఈ ఫోటోస్  ప్రస్తుతం అభిమానులను భలేగా ఆకట్టుకుంటున్నాయి.

అజయ్ దేవ్ గణ్ ఎంతో ఫ్రెండ్లీగా మన హీరోలతో  కలిసిపోవడం విశేషంగా చెప్పాలి. మరో నాలుగు రోజుల పాటు మన హీరోలతో అజయ్ దేవ్ గణ్ సన్నివేశాలు బ్యాలెన్స్ ఉండిపోయాయట. అవి కంప్లీట్ అవ్వగానే అజయ్ ఛలో ముంబై అట. జూలై 30 న డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా .. ఆ డేట్లో విడుదలవడం కష్టమని .. సినిమా దసరాకి రిలీజ్ అవుతుందని లేకుంటే.. వచ్చే సంక్రాంతికి వస్తుందని రకరకాల వార్తలు వస్తోన్న నేపథ్యంలో జక్కన్న మాత్రం దీని పై నోరు విప్పకుండా తన పనితాను చేసుకుంటూ పోతున్నాడు. మరి రాజమౌళి ఏమాంటాడో చూడాలి.

Leave a comment

error: Content is protected !!