Nikhil Siddharth : యూత్ స్టార్ నిఖిల్, టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మల కలయికలో తెరకెక్కిన తాజా చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్ ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. ‘స్వామిరారా’, ‘కేశవ’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న మూడో చిత్రం ఇది. ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించగా, రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించారు. దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రం ఒక ప్రేమ కథతో ముడిపడిన యాక్షన్ ఎంటర్టైనర్ అని చిత్ర యూనిట్ తెలిపింది. నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయి. దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందించగా, సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం అందించారు. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం నిర్వహించారు. బొమ్మరిల్లు చిత్రంలోని ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సూపర్ హిట్ సాంగ్ పల్లవితో రాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!