Janvikapoor : బాలీవుడ్‌ అందాల తార జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను ‘దేవర’ సినిమాతో అలరిస్తోంది. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న జాన్వీ.. ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా జాన్వీ ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘పరమ్ సుందరి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

‘దస్వీ’ ఫేమ్‌ దర్శకుడు తుషార్‌ జలోటా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమకథా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఈ జంట తెరపై కలిసి నటిస్తున్నది ఇదే మొదటిసారి. ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే ఈ జంట కలిసి కొన్ని ఫోటోషూట్‌లు చేయించుకున్నారు.

‘పరమ్ సుందరి’ చిత్రం చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని నిర్మాత దినేశ్‌ విజన్‌ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టును త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపాయి. ‘దేవర’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ‘పరమ్ సుందరి’ సినిమాతో తన కెరీర్‌లో మరో మైలురాయిని సృష్టించాలని భావిస్తోంది.

Leave a comment

error: Content is protected !!