Ramcharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్వరలో మరో విషయంలో కూడా పాపులర్ కాబోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియం వారు ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా, తన ప్రియమైన పెంపుడు కుక్క రైమ్‌తో కలిసి ఆయన విగ్రహం ప్రదర్శించబడనున్నది.

మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ వంటి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నటుల విగ్రహాలు ఉన్నాయి. ఈ జాబితాలో రామ్ చరణ్ కూడా చేరడం తెలుగు సినిమా ప్రేమికులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.  రామ్ చరణ్ తన కుక్క రైమ్‌ను ఎంతగా ప్రేమిస్తారో అందరికీ తెలుసు. అందుకే ఆయన తన మైనపు విగ్రహంతో పాటు రైమ్ విగ్రహాన్ని కూడా జత చేయాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం రైమ్ విగ్రహాన్ని తయారు చేసే పని జరుగుతోంది. రామ్ చరణ్ కూడా తన విగ్రహం తయారీకి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ఈ వార్త తెలిసి రామ్ చరణ్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం వ్యక్తమవుతోంది. తమ అభిమాన హీరో మరియు ఆయన కుక్క రైమ్‌ను ఒకే చోట చూడాలని ఎంతగానో ఆశపడుతున్నారు. అంతేకాకుండా, మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన శ్రీదేవి విగ్రహం కూడా మేడమ్ టుస్సాడ్స్‌లో ఉండడం విశేషం.

Leave a comment

error: Content is protected !!