Prathinidhi 2 : కంటెంట్‌ ఆధారిత సినిమాలకు పేరుగాంచిన నారా రోహిత్‌, తన ఎంపిక చేసుకునే కథలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. అయితే, ఆయన నటించిన ‘ప్రతినిధి-2’ మూవీ అంచనాలకు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. గతంలో విడుదలైన ‘ప్రతినిధి’ సినిమా సూపర్‌హిట్‌ కావడంతో, దీనికి సీక్వెల్‌గా, టీవీ5 మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రతినిధి-2’పై ప్రేక్షకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కథ బాగున్నప్పటికీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో, ‘ప్రతినిధి-2’ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానుంది. సెప్టెంబర్ 27 నుండి ఈ సినిమాను ప్రేక్షకులు ఆహాలో వీక్షించవచ్చు. థియేటర్లలో చూడలేని వారికి ఇది మంచి అవకాశం. ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి స్పందనను పొందుతుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!