Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్‌తో సందడి చేస్తున్నారు. గత సంవత్సరం సంక్రాంతి సీజన్‌లో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ వీటిలో ఒకటి. ఈ సాధారణ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చిరు ‘వాల్తేయర్ వీరయ్య’తో పోటీ ఉన్నప్పటికీ, ఇది మంచి లాభాలు తెచ్చి హిట్ అయ్యింది.

డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలయ్య నుంచి మంచి ఫెర్ఫార్మెన్స్ రాబట్టారు. ఆయన మాస్ ప్రెజెంటేషన్‌కు చాలా ప్రశంసలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం బాలయ్య అండ్ గోపీచంద్ మలినేని డ్యూయో.. మళ్లీ జట్టు కలవబోతున్నారు. ‘వీర సింహారెడ్డి’ తర్వాత.. బాలయ్య అనిల్ రావిపుడితో ‘భగవంత్ కేసరి’ చేశారు . అది కూడా హిట్ అయ్యింది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య. ఇది ఈ ఏడాది చివర విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

గోపిచంద్ మలినేని నిజానికి రవితేజతో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. కానీ అది వాయిదా పడింది. ప్రస్తుతం సన్నీ డియోల్ తో ఒక సినిమా చేస్తున్నారు. ఇది హిందీ సినిమా. మలినేని ఇప్పుడు బాలీవుడ్‌లో తన టాలెంట్ చూపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత బాలయ్య సినిమా మొదలు కావాలని భావిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లోని సాహు గరపతి ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక వార్తలు వచ్చే వరకు వేచి చూడాలి. అంతే కాకుండా, బాలయ్య తనకు ఇష్టమైన దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాను కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నారు. మరి ఈ రెండు ప్రాజెక్ట్‌లలో ఏది ముందు మొదలవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!