Shopping Cart 0 items - $0.00 0

ఫిబ్రవరి 15న రెగ్యులర్ షూటింగ్

నందమూరి బాలకృష్ణ , బోయపాటి శ్రీను కలయికలో మూడో చిత్రం లాంఛ్ అయి చాలారోజులు అయిపోతోంది.  కానీ, ఇంతవరకూ సెట్స్ మీదకు వెళ్ళనేలేదు. రూలర్ రిలీజ్ తర్వాత అంటే, డిసెంబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని అనుకున్నారు. కానీ అప్పుడు  కుదరలేదు. మళ్లీ  సంక్రాంతి తర్వాత అన్నారు. అదీ జరగకపోవడంతో నందమూరి అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురించి ఓ అఫీషియల్ అప్డేట్ వచ్చింది.  ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్  ఫిబ్రవరి 15న ప్రారంభం కానుందట.

ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి కావచ్చింది. బోయపాటి బృందం ప్రస్తుతం ఈ సినిమా లొకేషన్స్ వేటలో ఉంది. ఇక ఈ మూవీలో శ్రీకాంత్ విలన్ గా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. అలాగే ఇందులో సునీల్ కు బాలయ్య అనుచరుడిగా.. పూర్తి స్థాయి లో మంచి కేరక్టర్ డిజైన్ చేశాడట బోయపాటి.  కేథరిన్ ట్రెస్సా సెకండ్ హీరోయిన్ గా ఎంపికయిందట. మిర్యాల రవీంద్రరెడ్డి నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందించనున్నాడు.

 

Leave a comment

error: Content is protected !!