Venky and Trisha : విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం క్రైమ్ జోనర్‌లో సాగుతుంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. ‘సామజవరగమన’ తో మంచి పేరు తెచ్చుకున్న స్టోరీ రైటర్ నందు వెంకటేష్ కు ఒక కథ చెప్పగా ఆయన ఓకే చెప్పినట్టు సమాచారం. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాత.

ఈ చిత్రంలో త్రిషను కథానాయికగా ఫిక్స్ చేసినట్టు వినికిడి . 2025 వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. వెంకటేష్ అండ్ త్రిష ఇంతకుముందు ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’,  ‘నమో వెంకటేశ’, బాడీగార్డ్ ’ చిత్రాలలో కలిసి నటించారు. ఈ చిత్రం వారి నాలుగో కాంబినేషన్.

త్రిష ప్రస్తుతం చిరంజీవి నటించే ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల కానుంది. త్రిష మరియు వెంకటేష్ జోడీ చివరిగా ‘నమో వెంకటేశ’ చిత్రంలో కనిపించింది. ఈసారి వెంకటేష్ తో కలిసి నటిస్తున్న త్రిష మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Leave a comment

error: Content is protected !!